nandamuri suhasini: నందమూరి సుహాసిని ప్రచారం సమయంలో ఎదురుగా వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

  • టీఆర్ఎస్ మహిళా కార్యకర్తల వద్దకు వెళ్లి పలకరించిన సుహాసిని
  • కుశల ప్రశ్నలు వేసిన వైనం
  • షాక్ కు గురైన ఇరు పార్టీల కార్యకర్తలు

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి అందరినీ పలకరిస్తున్నారు. ఈనాటి ప్రచారంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆమె ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఆమెకు ఎదురు వచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మహిళా కార్యకర్తల వద్దకు వెళ్లిన సుహాసిని... వారిని పలకరించారు. కుశల ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా, తాము ఎన్టీఆర్ అభిమానులమని కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. వారితో కాసేపు మాట్లాడి, సుహాసిని ముందుకు కదిలారు. ఈ పరిణామాలతో ఇరు పార్టీల కార్యకర్తలు షాక్ అయ్యారు. ఇరు పార్టీలు ఎదురైనా... ఎలాంటి ఉద్రిక్తతలు ఎదురుకాకపోవడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News