kalyan dev: చిరూ చిన్నల్లుడి రెండో సినిమా గురించి ఫిల్మ్ నగర్ టాక్

  • సుధీర్ బాబు కోసం అనుకున్న కథ 
  • ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సుధీర్ బాబు 
  • కథానాయికగా తెరపైకి మెహ్రీన్ పేరు

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రెండో సినిమాకి రంగం సిద్ధమైంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి పులి వాసు దర్శకత్వం వహించనున్నాడు. నిన్ననే కల్యాణ్ దేవ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ కథ సుధీర్ బాబు కోసం అనుకున్నదనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది.

ఇదే బ్యానర్ పై .. ఇదే దర్శకుడితో సుధీర్ బాబు ఒక సినిమా చేయనున్నట్టుగా ఇటీవల వార్తలు షికారు చేశాయి. అయితే కారణమేంటనేది తెలియదుగానీ ఈ ప్రాజెక్టు నుంచి సుధీర్ బాబు తప్పుకున్నాడనీ, అడ్వాన్స్ ను కూడా వెనక్కి ఇచ్చేశాడనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే కథను కల్యాణ్ దేవ్ తో చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ పేరు వినిపిస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం ఏమిటనేది త్వరలోనే తెలియనుంది.       

More Telugu News