times now: తెలంగాణ రారాజు మళ్లీ కేసీఆరే... టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ సర్వే

  • 70 సీట్లను కైవసం చేసుకోనున్న టీఆర్ఎస్
  • కాంగ్రెస్ కు 31 స్థానాలు
  • 2 స్థానాలకే పరిమితంకానున్న టీడీపీ

కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు పట్టం కట్టబోతున్నారని టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ప్రీపోల్ సర్వే తెలిపింది. మొత్తం 119 స్థానాలకు గాను టీఆర్ఎస్ 70 సీట్లను కైవసం చేసుకోబోతోందని వెల్లడించింది. కాంగ్రెస్ 31, ఎంఐఎం 8, బీజేపీ 3 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమవుతుందని చెప్పింది. 5 సీట్లలో ఇతరులు గెలుస్తారని తెలిపింది. 4,800 మందిని సర్వే చేయడం ద్వారా టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ఈ ఫలితాలను వెల్లడించింది. నవంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు అభిప్రాయాలను సేకరించి, క్రోడీకరించినట్టు తెలిపింది. దాదాపు 40 నియోజకవర్గాల్లో సర్వేను నిర్వహించినట్టు పేర్కొంది.

ఓట్ల శాతం విషయానికి వస్తే... టీఆర్ఎస్ కు 37.55 శాతం, కాంగ్రెస్ కు 27.98, బీజేపీకి 11, టీడీపీకి 5.66, ఎంఐఎంకు 4.10, ఇతరులకు 13.71 శాతం వస్తాయని తెలిపింది. 45.27 శాతం మంది ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని... ఉత్తమ్ కుమార్ రెడ్డిని 30.55 శాతం, కోదండరాంను 3.37 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వెల్లడించింది.

More Telugu News