Petrol: 36 రోజుల్లోరూ. 8.43 తగ్గిన పెట్రోలు ధర... నేడు కూడా..!

  • నేడు లీటరు పెట్రోలుపై 40 పైసల తగ్గింపు
  • 41 పైసలు తగ్గిన డీజిల్ ధర
  • హైదరాబాద్ లో లీటరు పెట్రోలు రూ. 80.12

అంతర్జాతీయ చమురు మార్కెట్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు దిగొస్తున్న వేళ, ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల కొనసాగుతోంది. నేడు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఐఓసీఎల్ ప్రకటించింది. నేడు లీటరు పెట్రోలుపై 40 పైసలు, డీజిల్ పై 41 పైసల మేరకు ధర తగ్గింది.

దీంతో దేశ రాజధానిలో పెట్రోలు ధర రూ. 75.57కు, ముంబైలో రూ. రూ. 81.50కి, కోల్‌ కతాలో రూ. 77.53కు, చెన్నైలో రూ. 78.46, హైదరాబాద్‌ లో రూ. 80.12కు ధర తగ్గింది. ఇక డీజిల్ ధర న్యూఢిల్లీలో రూ. 70.56కు చేరగా, ముంబైలో రూ. 73.91గా, కోల్‌ కతాలో రూ. 72.41గా, చెన్నైలో రూ. 74.55గా, హైదరాబాద్‌ లో రూ. 76.77గా ఉంది.

కాగా, అక్టోబర్ 18 నుంచి పెట్రోలు ధరల తగ్గుదల ప్రారంభం కాగా, ఇప్పటివరకూ 36 రోజుల్లో మొత్తం రూ. 8.43 మేరకు పెట్రోలు ధర తగ్గింది.

More Telugu News