Revanth Reddy: కేసీఆర్‌, కేటీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు: రేవంత్

  • కేటీఆర్ ఒక ఆర్థిక నేరగాడు
  • కేసీఆర్ అతి తెలివికి పరాకాష్ట
  • రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు
  • కేటీఆర్‌ను వదిలేది లేదు

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ నేత కేటీఆర్‌పై  కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడ్చల్‌లో నిర్వహించనున్న యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారనడం అతిశయోక్తిగా ఉందన్నారు. కృష్ణా జలాలను తెలంగాణకు రాకుండా అడ్డుకునే శక్తి ఒక్క కర్ణాటకకే ఉందని.. గోదావరి జలాలు కూడా మహారాష్ట్ర నుంచే వస్తాయన్నారు. తెలంగాణ వదిలితేనే కృష్ణా, గోదావరి జలాలు ఆంధ్రాకు వెళతాయని.. కాబట్టి చంద్రబాబు అడ్డుకుంటున్నారనడం సరికాదన్నారు.

అతి తెలివికి పరాకాష్ట కేసీఆర్ అని.. కేటీఆర్‌తో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్‌లో పడుకుంటాననడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఎన్నో ఇసుక దందాలు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. ఎన్నికల తర్వాత కేటీఆర్‌ను వదిలేది లేదన్నారు. కేటీఆర్‌ ఆర్థిక నేరాలను వెలుగులోకి తెస్తామని, ఆయన దేశం విడిచి పారిపోకుండా అధికారులు చూడాలని కోరారు. 

More Telugu News