bhikshapathi yadav: భిక్షపతి యాదవ్ ను కలిసిన భవ్య ఆనందప్రసాద్

  • శేరిలింగంపల్లి నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ఆనందప్రసాద్
  • రెబెల్ గా నామినేషన్ వేసిన భిక్షపతి యాదవ్
  • తన గెలుపుకు సహకరించాలని కోరిన ఆనందప్రసాద్

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ కు ఆటంకాలు తొలగిపోయాయి. మహాకూటమిలో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో... కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ రెబెల్ గా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పెద్దలు ఆయనను కలసి బుజ్జగించారు. దీంతో, పోటీ నుంచి తప్పుకునేందుకు ఆయన అంగీకరించారు.

మరోవైపు, ఈ ఉదయం భిక్షపతి యాదవ్ ఇంటికి భవ్య ఆనందప్రసాద్ వెళ్లారు. ఆయకు పుష్పగుచ్ఛం అందించి... ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని కోరారు. తన గెలుపుకు సహకరించాలని అభ్యర్థించారు. ఆనందప్రసాద్ విన్నపం పట్ల భిక్షపతి సానుకూలంగా స్పందించారు.

More Telugu News