agri gold: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా నిలుస్తాం: వైఎస్ జగన్

  • బాబు ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం
  • సీఎం చంద్రబాబు అమ్ముడుపోయారు
  • మోసగాళ్ల పక్షాన నిలబడ్డారు 

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా నిలుస్తామని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘బాబు ప్రభుత్వం మానవత్వం లేని ప్రభుత్వం. బాధితుల పక్షాన నిలబడాల్సిన ముఖ్యమంత్రి కాసులకు అమ్ముడుపోయి మోసగాళ్ల పక్షాన నిలబడ్డారు’ అని తన పోస్ట్ లో ఆరోపించారు. 

More Telugu News