ntr: ఎన్టీఆర్ .. చరణ్ లతో తలపడే విలన్ గా స్టార్ హీరో?

  • కన్నడలో స్టార్ హీరోగా 'యష్'
  • విలక్షణ నటుడిగా క్రేజ్ 
  • వచ్చేనెలలో 'కేజీఎఫ్' రిలీజ్

ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ షూటింగ్ మొదలైపోయింది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా కీర్తి సురేశ్ పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ స్టార్ హీరోలే. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ కూడా ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అలాంటి హీరోలతో ఈ సినిమాలో తలపడే విలన్ ఎవరై వుంటారా అనే విషయమే ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో 'యష్'పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల కాలంలో కన్నడ సినిమాల్లో 'యష్' స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. మంచి ఫిజిక్ .. విలక్షణమైన నటనతో  ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆయనను ఈ సినిమాలో విలన్ గా తీసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.' యష్'తాజా చిత్రం 'కేజీఎఫ్' వచ్చేనెల 21వ తేదీన తెలుగులోనూ విడుదలకానుంది. 

More Telugu News