team india: తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా.. 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

  • 24 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
  • 7 పరుగులకు పెవిలియన్ చేరిన షార్ట్
  • ప్రస్తుత స్కోరు వికెట్ నష్టానికి 42 పరుగులు

బ్రిస్బేన్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. షార్ట్, ఫించ్ లు ఆసీస్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఆదిలోనే ఆసీస్ కు భారత బౌలర్లు షాకిచ్చారు. జట్టు స్కోరు 24 పరుగులు (4.1 ఓవర్లు) ఉన్నప్పుడు షార్ట్ (7)ను అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. స్కోరు 64 వద్ద ఉన్నప్పుడు ఫించ్ ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం లిన్ 30 (16 బంతులు), మ్యక్స్ వెల్ 3 (4 బంతులు) క్రీజులో ఉన్నారు. ఆసీస్ స్కోరు 9.3 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు.

భారత జట్టు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ, రాహుల్, పంత్, దినేష్ కార్తీక్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కేకే అహ్మద్.

ఆస్ట్రేలియా జట్టు: ఫించ్, షార్ట్, క్రిస్ లిన్, మ్యాక్స్ వెల్, స్టొయినిస్, మెక్ డెర్మాట్, క్యారీ, ఆడం జంపా,ఆండ్రూ టై, బెహ్రెన్ డార్ఫ్, స్టాన్ లేక్.

More Telugu News