Jagan: ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్... జగన్ ను సెల్ఫీ అడిగిన వేళ..!

  • 300 రోజులు దాటిన జగన్ పాదయాత్ర
  • మార్గమధ్యంలో సెల్ఫీ అడిగిన డ్రైవర్ తో ఫోటో దిగిన జగన్
  • ఇప్పటివరకూ 3,280 కి.మీ నడిచిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 300 రోజుల క్రితం ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర, ప్రస్తుతం విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సాగుతున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. జగన్ పాదయాత్ర మార్గంలో వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్, జగన్ ను చూసిన ఆనందంలో సెల్ఫీ దిగాలని ఉందని కోరాడు. అతని కోరికను తీర్చాలని నిర్ణయించుకున్న జగన్, డ్రైవర్ సెల్ ఫోన్ ను అడిగి తీసుకుని అతనితో సెల్ఫీ దిగాడు. దీంతో ఆ డ్రైవర్ ముఖం ఆనందంతో వెలిగిపోగా, ఈ దృశ్యాన్ని పాదయాత్రను చిత్రీకరిస్తున్న కెమెరాలు బంధించాయి.

కాగా, నిన్నటివరకూ జగన్ మొత్తం 3,280 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేయగా, నేడు 303వ రోజు యాత్ర మొదలైంది. మరో నాలుగు రోజుల్లో జగన్ యాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది.

More Telugu News