samshabad airport: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి 22 బుల్లెట్లు స్వాధీనం

  • భద్రతా పరమైన తనిఖీల్లో బయటపడడంతో కలకలం
  • తరలిస్తున్న వ్యక్తిని ఇటలీకి చెందిన నికోలి సంగర్‌ మనోగా గుర్తింపు
  • నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి 22 బుల్లెట్లను తీసుకువెళుతూ ఓ వ్యక్తీ పోలీసులకు చిక్కాడు. విమానాశ్రయం భద్రతా సిబ్బంది తమ తనిఖీల్లో వీటిని గుర్తించారు. తరలిస్తున్న వ్యక్తిని ఇటలీకి చెందిన నికోలి సంగర్‌ మనోగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీటిని అతను ఎందుకు తరలిస్తున్నాడు, ఎక్కడికి తీసుకువెళ్తున్నాడన్న దానిపై ఆరాతీస్తున్నారు.

More Telugu News