Congress: కాంగ్రెస్ లో చేరిన ఆల్ ఇండియా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు దిడ్డి రాంబాబు!

  • మీడియాకు తెలిపిన దిడ్డి రాంబాబు
  • గతంలో జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ గా సేవలు
  • మహా కూటమిని గెలిపించాలని పిలుపు

అఖిల భారత మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దిడ్డి రాంబాబు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. గతంలో జీహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ గానూ రాంబాబు పనిచేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహా కూటమిని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని, అప్పుడే దేశంలో మతతత్వ రాజకీయాలు దూరమవుతాయని దిడ్డి రాంబాబు అభిప్రాయపడ్డారు.

More Telugu News