New Delhi: న్యూఢిల్లీలోకి చొరబడిన ఇద్దరు టెర్రరిస్టులు... ఫోటో విడుదల చేసిన పోలీసులు!

  • ఆనవాళ్లు కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేయండి
  • నల్లటి కుర్తాలతో ఉన్న యువకుల చిత్రం విడుదల
  • హెచ్చరించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు

ఇద్దరు ఉగ్రవాదులు న్యూఢిల్లీలోకి ప్రవేశించారని, వారు ఏ క్షణమైనా ఉగ్రదాడికి పాల్పడవచ్చని చెబుతూ ఇద్దరి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. వీరితో జాగ్రత్తగా ఉండాలని, ఈ ఆనవాళ్లతో ఎవరైనా తారసపడితే, 011-23520787 లేదా 011-2352474 ఫోన్ నంబర్లకు కాల్ చేసి చెప్పాలని పోలీసులు కోరారు.

కాగా, ఈ ఫోటోలో ఢిల్లీకి 360 కిలోమీటర్లు, ఫిరోజ్ పూర్ కు 9 కిలోమీటర్ల దూరం ఉన్న ఓ మైలురాయి వద్ద ఇద్దరు నల్లటి కుర్తాలు ధరించిన యువకులు ఉన్నారు. ఫిరోజ్ పూర్ పట్టణం పంజాబ్ లోని ఇండియా - పాకిస్థాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంది. కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు. కాగా, గత వారంలో జైషే మొహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులు ఢిల్లీ దిశగా కదులుతున్నట్టు సమాచారం అందుతోందని పంజాబ్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News