2.0: రెండున్నర గంటలలోనే ముగిసిపోయే '2.0'!

  • '2.ఓ' సెన్సారింగ్ పూర్తి
  • ఎటువంటి కట్స్ చెప్పని సెన్సార్ బోర్డు
  • కొన్ని పదాలను మ్యూట్ చేయాలని సూచన

ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రావడానికి ఇంకెంతో సమయం లేదు. మరో ఎనిమిది రోజుల్లో ఆయన కొత్త చిత్రం '2.ఓ' థియేటర్లోకి రానుంది. రజనీకాంత్ తో పాటు అక్షయ్‌ కుమార్, అమీజాక్సన్‌ తదితరులు నటించగా, శంకర్‌ దర్శకత్వంలో సుమారు రూ. 550 కోట్ల బడ్జెట్‌ తో ఇది తయారైంది.

ఇక ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా నిడివి రెండున్నర గంటలు కూడా లేదట. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 2.28.52 సెకన్ల చిత్రమిది. సినిమాకు ఎటువంటి కట్స్ చెప్పని సెన్సార్ బోర్డు, కొన్ని పదాలను మాత్రం పైకి వినిపించకుండా చేయాలని సూచించిందని తెలుస్తోంది. గతంలో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'జెంటిల్‌ మన్', 'భారతీయుడు', 'అపరిచితుడు', 'రోబో’లతో పోలిస్తే, '2.ఓ' నిడివి తక్కువ కావడం గమనార్హం.

More Telugu News