delhi cm: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కారప్పొడితో దాడి..అదుపులో నిందితుడు!

  • ఢిల్లీ సచివాలయంలో లంచ్ సమయంలో ఘటన
  • కేజ్రీవాల్ తన గది నుంచి బయటకు వస్తుండగా దాడి
  • పగిలిపోయిన కేజ్రీవాల్ కళ్లజోడు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై దాడి జరిగింది. సచివాలయంలో ఉన్న కేజ్రీవాల్.. లంచ్ సమయం కావడంతో తన గదిలో నుంచి బయటకు వస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. అక్కడికి దూసుకొచ్చిన అనిల్ కుమార్ అనే వ్యక్తి  తన వెంట తెచ్చుకున్న కారప్పొడితో ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం. వెంటనే స్పందించిన సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఈ ప్రయత్నంలో కేజ్రీవాల్ కళ్లజోడు పగిలిపోయినట్టు సంబంధిత వర్గాల సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేబట్టారు.   

More Telugu News