krishnaveni: నా వాళ్లను వదులుకున్నందు వల్లనే ఆనందంగా వున్నాను: సీనియర్ నటి కృష్ణవేణి

  • కూతురికి ఎలాంటి లోటు చేయలేదు 
  • మనవరాలికి కూడా కోటి ఇచ్చాను 
  • సంపాదించే యంత్రంలా చూస్తున్నారు  

ఎన్నో సినిమాల్లోను .. మరెన్నో ధారావాహికల్లోను నటిస్తూ కృష్ణవేణి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి కృష్ణవేణి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఈ మధ్యనే ఇల్లు అమ్మేసి నా కూతురికి యాభై లక్షలు .. నా మనవరాలికి ఒక కోటి రూపాయలు ఇచ్చాను. చెన్నైలో నెలకి 60 వేలు అద్దె వచ్చే ఇంటిని కూడా నా కూతురికే ఇచ్చేశాను. హైదరాబాద్ లోని ఇల్లు కూడా ఇస్తానని చెప్పేసి, చెన్నైలోని ఇంటిని అమ్ముకుని ఇక్కడికి వచ్చేశాను.

ఇప్పుడు వాళ్లెవరితోను నేను మాట్లాడటం లేదు. అయిన వాళ్లంతా కూడా సంపాదించే ఒక యంత్రంలా చూస్తున్నారు. యంత్రం పాడైపోతే పక్కన పడేస్తారు .. నాలాంటి వాళ్ల పరిస్థితి కూడా అంతే. నా నుంచి నా వాళ్లు ఆశిస్తున్నది కేవలం డబ్బు మాత్రమేనని తెలుసుకుని దూరంగా ఉంటున్నాను. ఉన్నది కూడా తీసేసుకుంటే నేను కష్టాలు పడాల్సి వస్తుందని అలా చేశాను. అయినా వాళ్లందరినీ వదులుకోవడం వల్లనే ఇప్పుడు నేను ఆనందంగా ఉంటున్నాను. ఈ రోజుల్లో మన పిల్లలు మనల్ని చూస్తారనిగానీ .. చూడాలి అనిగాని అనుకోకూడదు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.   

More Telugu News