bcci: ధోని స్థానంలో యువ ఆటగాడు.. ఆస్ట్రేలియాతో తొలి టీ-20కి జట్టుని ప్రకటించిన బీసీసీఐ!

  • రేపు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ-20
  • రిషబ్ పంత్‌ కి  వికెట్ కీపర్‌ గా బాధ్యతలు
  • ప్రకటించిన బీసీసీఐ

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు తొలి టీ-20 జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో రేపు ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ-20కి 12మంది సభ్యులతో కూడిన జట్టుని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఎంఎస్ ధోని స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్‌ కి వికెట్ కీపర్‌ గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది.

భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, యజ్వేంద్ర చాహల్..

More Telugu News