samanta: సింహాచలం రైల్వే స్టేషన్లో సమంత .. చైతూ సందడి

  • చైతూ సమంత జోడీగా 'మజిలీ'
  • దర్శకుడిగా శివ నిర్వాణ 
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు

పెళ్లి తరువాత సమంత ... నాగ చైతన్య జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ సింహాచలం రైల్వే స్టేషన్లో జరిగింది. సమంతను బైక్ పై ఎక్కించుకుని రైల్వే స్టేషన్లోకి వేగంగా తీసుకువస్తాడు చైతూ. బైక్ దిగగానే టికెట్ కౌంటర్ వైపు సమంత హడావిడిగా పరిగెడుతుంది. రైల్వే స్టేషన్లో ప్రయాణీకులు అంతా ఉండగానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడం విశేషం.

సమంత - చైతూలను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలి వచ్చారు. సినిమాలో కీలకమైన ఒక సందర్భంలో ఈ సీన్ రానుంది. ఈ సినిమాకి 'మజిలీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సమంత - చైతూ ఇద్దరూ ఈ సినిమాలో భార్యాభర్తలుగానే కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పెళ్లి తరువాత మొదటిసారిగా ఈ జంట కలిసి నటిస్తోన్న ఈ సినిమా, వాళ్లకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.       

More Telugu News