sumanth: 'సుబ్రహ్మణ్య పురం' నుంచి రేపు ట్రైలర్

  • ఆలయం చుట్టూ తిరిగే కథ 
  • అనూహ్యమైన మలుపులు 
  • సక్సెస్ పై సుమంత్ .. ఈషా ఆశలు      

సుమంత్ కథానాయకుడిగా జాగర్లపూడి సంతోశ్ దర్శకత్వంలో 'సుబ్రహ్మణ్య పురం' నిర్మితమైంది. బీరం సుధాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో, సుమంత్ జోడీగా ఈషా రెబ్బా నటించింది. ఒక గ్రామంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఆసక్తికరమైన కథాకథనాలు .. అనూహ్యమైన మలుపులు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయని అంటున్నారు.

ఈ సినిమా నుంచి రేపు రాత్రి 7 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు. ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెంచే ఆలోచనలో వున్నారు. దర్శకుడిగా ఈ సినిమాతో తన సత్తాను చాటుకోవలసిన బాధ్యత సంతోశ్ పైనే వుంది. ఇక సుమంత్ .. ఈషా రెబ్బా ఇద్దరికీ కూడా ఈ సినిమా హిట్ తెచ్చిపెట్టవలసి వుంది. ఈ సినిమాపై ఇద్దరూ ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ల ఆశ ఈ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి.    

More Telugu News