Anushka Sharma: తన ప్రతిమను చూసి అవాక్కై.. సెల్ఫీ తీసుకున్న అనుష్క శర్మ!

  • మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో అనుష్క ప్రతిమ
  • చేతిలో సెల్ ఫోన్ తో అందంగా రూపుదిద్దుకున్న బొమ్మ
  • ఆశ్చర్యపోయి సెల్ఫీ దిగిన హీరోయిన్ అనుష్క శర్మ 

మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటైన తన మైనపు బొమ్మను చూసి ఆశ్చర్యపోయిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, దానితో సెల్ఫీ తీసుకుని మురిసిపోయింది. మ్యూజియంలోని మిగతా విగ్రహాలకు లేని ప్రత్యేకత ఈ విగ్రహానికి ఉండటం గమనార్హం.

ఈ ప్రతిమ చేతిలో ఓ సెల్ ఫోన్ ఉంటుంది. దానితో ఎవరైనా సెల్ఫీ దిగవచ్చు. ఆ వెంటనే డిజిటల్ రూపంలో ఆ చిత్రం ట్రాన్స్ ఫర్ అవుతుంది. ఈ బొమ్మను తొలిసారిగా చూసిన అనుష్క, షాక్ నకు గురై, "ఈ బొమ్మ ఎంత సహజ సిద్ధంగా ఉందంటే.. నేనే అదిరిపడ్డాను" అని వ్యాఖ్యానించింది. వెంటనే ఆ ప్రతిమతో సెల్ఫీ దిగింది. కాగా, ప్రస్తుతం అనుష్క, షారూక్ హీరోగా నటిస్తున్న 'జీరో' చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. 

More Telugu News