Hyderabad: హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లిన కారు!

  • వేగంగా వస్తూ అదుపుతప్పిన కారు
  • నలుగురికి తీవ్ర గాయాలు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ తెల్లవారుజామున హైదరాబాద్, నక్లెస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి హుస్సేన్‌ సాగర్‌ జలాశయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. లుంబినీ పార్క్‌ వద్ద జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. కారు ప్రమాదం కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడగా, జలాశయం నుంచి కారును వెలికితీస్తుంటే, వాహనదారులు ఆసక్తిగా చూశారు.

More Telugu News