Andhra Pradesh: విజయవాడ నుంచి ఇండిగో అంతర్జాతీయ సర్వీసులు.. ప్రారంభోత్సవానికి రావాలంటూ చంద్రబాబుకు ఆహ్వానం

  • ఏపీవాసులకు గుడ్‌న్యూస్
  • విజయవాడ-సింగపూర్ మధ్య నేరుగా విమాన సర్వీసులు
  • డిసెంబరు 4న ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది శుభవార్తే. సింగపూర్ వెళ్లాలనుకునే వారు ఇకపై హైదరాబాద్‌కో, చెన్నైకో వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పుడు నేరుగా విజయవాడ నుంచి సింగపూర్ ఎగిరిపోవచ్చు. ఈ మేరకు బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో అంతర్జాతీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.  

ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో రాష్ట్ర ఇంధన, మౌలిక సదుపాయాలు, సీఆర్‌డీఏ చేసుకున్న అవగాహనా ఒప్పందంలో భాగంగా సింగపూర్‌కు నేరుగా విమానాలు నడపనుంది. డిసెంబరు 4 నుంచి విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఇండిగో ఆహ్వానించింది.

More Telugu News