varun tej: విలన్ పాత్ర కోసం వరుణ్ తేజ్ తో సంప్రదింపులు?

  • తమిళంలో హిట్ కొట్టిన 'జిగర్తాండ'
  • విలన్ గా బాబీసింహాకి మంచి మార్కులు 
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు  

విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ .. ఒక్కో సినిమాను చేసుకుంటూ వరుణ్ తేజ్ ముందుకు వెళుతున్నాడు. ఆయన చేసిన 'అంతరిక్షం' డిసెంబర్లో విడుదల కానుండగా, 'ఎఫ్ 2' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విలన్ పాత్రకి వరుణ్ తేజ్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది.

ఆ మధ్య తమిళంలో సిద్ధార్థ్ హీరోగా బాబీ సింహా విలన్ గా వచ్చిన 'జిగర్తాండా' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం వరుణ్ తేజ్ అయితే బాగుంటాడని భావిస్తున్నారట. ఆయనను సంప్రదించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. తమిళంలో విలన్ పాత్ర చేసిన బాబీసింహాకి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అది దృష్టిలో పెట్టుకుని వరుణ్ తేజ్ అంగీకరిస్తాడో .. లేదంటే సైలెంట్ గా 'నో' చెప్పేస్తాడో చూడాలి.    

More Telugu News