saidharam tej: మెగా హీరో రంగంలోకి దిగిపోయాడు

  • కిషోర్ తిరుమల నుంచి 'చిత్రలహరి'
  • ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • ఏప్రిల్లో రిలీజ్ చేసే ఆలోచన     

కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయడానికి చాలా రోజుల క్రితమే సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను లాంచ్ చేసి కూడా కొన్ని రోజులైంది. ఈ సినిమాలో కథానాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. వాళ్ల పాత్రల పేర్లు 'చిత్ర - లహరి' కావడం వలన ఈ సినిమాకి 'చిత్రలహరి'అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సాధారణంగా కిషోర్ తిరుమల సినిమాలు యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుంటాయి. అలాగే ఈ సినిమా కూడా లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కొనసాగుతుందట. ఏప్రిల్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాతోనైనా సాయిధరమ్ తేజ్ కి హిట్ దొరుకుతుందేమో చూడాలి.     

More Telugu News