nithin: రెండు సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టేసిన నితిన్

  • వెంకీ కుడుములతో నితిన్ 
  • డిసెంబర్లో సెట్స్ పైకి 'భీష్మ'
  • గీతా ఆర్ట్స్ 2పై తదుపరి సినిమా    

కొంతకాలంగా నితిన్ కి సరైన హిట్ లేదు. పెద్ద ప్రాజెక్టులే చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఆయన వున్నాడు. ఒక వైపున సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దర్శకుడు వెంకీ కుడుములతో చేయడానికి ఓకే చెప్పాడు. మరో వైపున గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై దర్శకుడు ప్రతాప్ తో చేయడానికి గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్న సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. డిసెంబర్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక ప్రతాప్ దర్శకత్వం వహించనున్న సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు సినిమాలను ఒకేసారి చేస్తూ వెళ్లేలా నితిన్ ప్లాన్ చేసుకున్నాడు. హిట్ కోసం ఆయన చేస్తోన్న నిరీక్షణ ఈ సారైనా ఫలిస్తుందేమో చూడాలి.        

More Telugu News