Mahesh Babu: మహేశ్ జోడీగా సందడి చేయనున్న సోనాల్ చౌహాన్

  • హైదరాబాద్ లో 'మహర్షి' షూటింగ్ 
  • భారీ విలేజ్ సెట్లో చిత్రీకరణ 
  • ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే  

గతంలో 'లెజెండ్'.. 'పండగ చేస్కో'.. డిక్టేటర్' వంటి సినిమాల్లో రెండవ కథానాయికగా నటించిన సోనాల్ చౌహాన్, ఈ సారి మహేశ్ బాబుతోనే కలిసి సందడి చేయనుంది. మహేశ్ బాబు తన 25వ సినిమాగా 'మహర్షి' చేస్తున్నాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ వేసిన భారీ విలేజ్ సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర రెండు దశలుగా కొనసాగుతుంది. ఒక దశలో ఆయన సరసన పూజా హెగ్డే మెరిస్తే, మరో దశలో ఆయనకి సోనాల్ చౌహాన్ కనెక్ట్ అవుతుందట. ముందుగా ఈ పాత్రకి మెహ్రీన్ అనుకున్నప్పటికీ, ఆ తరువాత ఆ అవకాశం సోనాల్ చౌహాన్ ని వరించిందని చెబుతున్నారు. 

More Telugu News