Vijayanagaram District: విజయనగరం వైసీపీ నేత యడ్ల రమణమూర్తి కన్నుమూత

  • అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి
  • సీనియర్‌ నాయకుడు బొత్స సత్తిబాబుకు రమణమూర్తి బంధువు
  • టీడీపీ నుంచి కాంగ్రెస్‌, అనంతరం వైసీపీలో చేరిక

విజయనగరం పట్టణానికి చెందిన సీనియర్‌ రాజకీయ నాయకుడు యడ్ల రమణమూర్తి అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణకు ఆయన సమీప బంధువు. ఒకప్పుడు విజయనగరం టీడీపీలో కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన రమణమూర్తి వైఎస్సార్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు, తన బంధువు సత్తిబాబు పార్టీలో కీలక నేతగా మారడంతో సైకిల్‌ దిగి చెయ్యందుకున్నారు. ఆ తర్వాత బొత్సతోపాటే వైసీపీలో చేరారు. అనారోగ్యం కారణంగా కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్ది రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.

More Telugu News