t-Telugudesam: టీ-టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ.. నందమూరి సుహాసినికి ఘనస్వాగతం!

  • ఎన్టీఆర్ భవన్ లో బీ-ఫారాల అందజేత
  • తొలి బీ-ఫారం అందుకున్న సుహాసిని
  • అభ్యర్థులతో ప్రమాణం చేయించిన సీనియర్ నేత రావుల

టీ-టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలను ఈరోజు పంపిణీ చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. తొలి బీ-ఫారాన్ని కూకట్ పల్లి అభ్యర్థి నందమూరి సుహాసినికి పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. సండ్ర వెంకట వీరయ్య, కొత్తకోట దయాకర్ రెడ్డి, భవ్య ఆనందప్రసాద్ తో పాటు మిగిలిన అభ్యర్థులకు కూడా బీ-ఫారాలు అందజేశారు. టీడీపీ అభ్యర్థుల చేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణం చేయించారు. పార్టీ నిబద్ధతకు కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు ప్రమాణం చేశారు.

సుహాసినికి ఘన స్వాగతం పలికిన అభిమానులు

ఎన్టీఆర్ భవన్ కు నేడు తొలిసారిగా నందమూరి సుహాసిని విచ్చేశారు. బీ-ఫారం అందుకునేందుకు వెళ్లిన ఆమెకు టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె నివాళులర్పించారు.

More Telugu News