Vijayawada: ప్రకాశం బ్యారేజ్ లో 'ఫార్ములా వన్' ఫైనల్స్

  • ఈ పోటీల్లో పాల్గొన్న 9 జట్లకు చెందిన 19 బోట్లు
  • ఐదో స్థానంలో బరిలోకి దిగిన అమరావతి బోట్ డ్రైవర్  
  • ఈ పోటీలను తిలకిస్తున్న చంద్రబాబు, మంత్రులు

విజయవాడలో రెండు రోజులుగా సాగుతున్న ఫార్ములా వన్ హెచ్ 2వో బోట్ రేసింగ్ ఫైనల్స్ కొద్ది సేపటి క్రితం ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ లో జరుగుతున్న ఈ పోటీల్లో 9 జట్లకు చెందిన 19 బోట్లు బరిలోకి దిగాయి. అమరావతి బోట్ డ్రైవర్ అండర్సన్ ఐదో స్థానంలో బరిలోకి దిగారు.

గంటపాటు జరగనున్న ఈ తుది పోటీలను సీఎం చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమ, అఖిలప్రియ తదితర నాయకులు వీక్షిస్తున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అంతర్జాతీయ బోటు డ్రైవర్లు తమ సత్తా చూపిస్తూ స్పీడ్ బోట్లపై దూసుకెళ్తున్నారు. 

More Telugu News