Hyderabad: హమ్మయ్య... టెన్షన్ పెట్టిన స్పైస్‌ జెట్‌ విమానం క్షేమం!

  • రేణిగుంటలో దిగాల్సిన స్పైస్ జెట్ విమానం
  • హైదరాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

వంద మందికి పైగా ప్రయాణికులతో ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతికి చేరాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ విమానం రేణిగుంటలో ల్యాండ్ కాకుండా, తిరిగి హైదరాబాద్ కు మళ్లడంతో, అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వుందని పైలట్ చెప్పడంతో, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అనుమతించారు. విమానాన్ని క్షేమంగా దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ తదితర ప్రముఖులు ఉన్నారు. కాగా, గడచిన నెలరోజుల వ్యవధిలో ఇదే స్పైస్‌ జెట్‌ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటం ఇది మూడోసారి కావడం గమనార్హం.

More Telugu News