BJP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనీసం 297 సీట్లు గ్యారెంటీ... బీజేపీ సొంత సర్వే!

  • 297 నుంచి 303 సీట్లలో విజయం
  • 5.40 లక్షల మందిని ప్రశ్నించాం
  • కేంద్ర మంత్రి పీయుష్ గోయల్

వచ్చే సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 297 నుంచి 303 సీట్లలో విజయం సాధిస్తుందని బీజేపీ సొంత సర్వే ఒకటి తేల్చింది. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఈ సర్వేను తన టీమ్ తో నిర్వహించి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని 5.40 లక్షల మందిని ప్రశ్నించి రూపొందించారు.

ఇదే విషయాన్ని వెల్లడించిన ఆయన, 2013లో తాను ఇదే విధంగా సర్వే చేయించగా, కచ్చితమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ సర్వేను ఆగస్టు - సెప్టెంబర్ నెలల్లో నిర్వహించామని, బీజేపీ మంచి ఫలితాలను రాబట్టనుందని రావడం సంతోషకరమని అన్నారు. వార్షిక ఈటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన, ఓ ప్రైవేటు ఏజన్సీ సాయంతో సర్వే చేయించానని అన్నారు. ఐదున్నర లక్షల మందిని భాగం చేస్తూ, ప్రపంచంలో ఇంతవరకూ ఏ సర్వే జరగలేదని చెప్పారు.

More Telugu News