AP DGP: తిరుపతి వెళుతున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం... తిరిగి హైదరాబాదుకు!

  • ఈ ఉదయం తిరుపతికి బయలుదేరిన విమానం
  • రేణిగుంటలో ల్యాండ్ కావాల్సిన విమానం తిరిగి హైదరాబాద్ కు
  • విమానంలో పలువురు ప్రముఖులు

ఈ ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో, రేణిగుంటలో దిగే అవకాశం లేదని భావించిన పైలట్, దాన్ని తిరిగి హైదరాబాద్ మళ్ళించాడు. ఇంకా ఆ విమానం హైదరాబాద్ కు చేరలేదు. ఈ విమానంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. విమానం వెనుదిరగడంపై మరింత సమాచారం తెలియాల్సివుంది.

More Telugu News