BJP: బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా జీవిత, పురందేశ్వరి, స్వామి పరిపూర్ణానంద!

  • స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన బీజేపీ
  • మొత్తం 40 మంది ఎంపిక
  • నటుడు సాయికుమార్, యోగి ఆదిత్యనాథ్, స్మృతీ ఇరానీ తదితరులు కూడా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించిన బీజేపీ, ప్రచారానికిగాను స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా, 40 మంది పేర్లను సెలక్ట్ చేసింది. వీరంతా తెలంగాణలో పర్యటించి, ప్రచారం చేస్తారని పేర్కొంది. ఈ జాబితాలో నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, దగ్గుబాటి పురందేశ్వరి, స్వామి పరిపూర్ణానంద తదితరుల పేర్లనూ చేర్చింది.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో నరేంద్ర మోదీ, అమిత్‌ షాలతో పాటు రాజ్‌ నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, రామ్‌ లాల్‌, యోగి అదిత్యానాథ్‌, రమణ్‌ సింగ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, నిర్మలా సీతారామన్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, డీవీ సదానంద గౌడ, జగత్‌ ప్రకాశ్‌ నడ్డా, స్మృతి ఇరానీ, పియూష్‌ గోయల్‌, థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, పురుషోత్తమ్‌ రూపాలా, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, హన్స్‌ రాజ్‌ గంగారామ్‌, జువల్‌ ఓరం, రామ్ మాధవ్‌, మురళీధర్‌ రావ్‌, హేమమాలిని, బీఎల్‌ సంతోష్‌ తదితరులున్నారు.

వీరితో పాటు పీకే కృష్ణదాస్‌, సాయికుమార్‌, కే లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, కిషన్‌ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, స్వామి పరిపూర్ణానంద, ప్రేమెందర్‌ రెడ్డి, చింతా సాంబమూర్తి, జీవితా రాజశేఖర్‌, కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి, కే హరిబాబు, జీవీఎల్‌ నరసింహారావు, మంత్రి శ్రీనివాసులు కూడా ఉన్నారు.

More Telugu News