Tamilnadu: నేత్రదానం చేసేందుకు నిర్ణయించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్!

  • వేలచ్చేరిలో ప్రారంభమైన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్
  • గెస్టుగా వచ్చిన కీర్తి సురేష్
  • చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు

'మహానటి'తో అపరిమితమైన అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్, తన కళ్లను దానం చేస్తానని చెప్పింది. తమిళనాడులోని వేలచ్చేరిలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ప్రారంభం కాగా, ఈ కార్యక్రమానికి గెస్టుగా వచ్చిన కీర్తి, మాట్లాడింది. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలని సూచిస్తూ, తాను కూడా కళ్లను దానమిస్తానని పేర్కొంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆసుపత్రి చైర్మన్ అమర్ అగర్వాల్, తాము వంద మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్టు తెలిపారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన కీర్తిని చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలిరాగా, వేలచ్చేరిలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా కీర్తిని ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా సత్కరించింది.

More Telugu News