Ranveer Singh: ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన దీపిక-రణ్‌వీర్ జంట.. హాట్ టాపిక్‌గా మారిన ధర!

  • జుహులో రూ. 50 కోట్ల విలువైన భవనం కొనుగోలు
  • నేడు బారత్‌కు రానున్న కొత్త జంట
  • 21న తొలి విందు

బాలీవుడ్ హాట్ కపుల్ దీపిక పదుకొనే-రణ్‌వీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటయ్యాక ఇప్పుడు వారికి సంబంధించిన మరో వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో అత్యంత ఖరీదైన ఇల్లు కొన్నారన్నదే ఆ వార్త. దీని ఖరీదు రూ. 50 కోట్లంటూ బాలీవుడ్‌లో ప్రచారం మొదలైంది. విశాలమైన ఈ భవనంలో తమకు ఇష్టమైన రీతిలో ఇంటీరియర్‌ను డిజైన్ చేయించుకుంటున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, పూర్తయ్యాకే ఇంటిలో దిగుతారని సమాచారం. అప్పటి వరకు రణ్‌వీర్ ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోనే ఇద్దరూ ఉంటారని తెలుస్తోంది.

దీపిక పదుకొనే-రణ్‌వీర్ సింగ్‌లు ఇటీవల ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ప్రపంచంలోనే రొమాంటిక్ డెస్టినేషన్ అయిన లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో కొంకణి, సింధీ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు. నేడు భారత్‌కు రానున్న కొత్త జంట ఈనెల 21న బెంగళూరులో, 28న ముంబైలో వివాహ విందు ఇవ్వనున్నారు. రణ్‌వీర్‌కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల కోసం డిసెంబరు 1న ముంబైలో మరో విందు ఇవ్వనున్నారు.

More Telugu News