Congress: 'నన్ను బలిపశువును చేశారు' అంటూ... కాంగ్రెస్ కు శంకర్రావు రాజీనామా!

  • సమాజ్ వాదీ పార్టీలో చేరుతున్నా
  • విధేయులకు గుర్తింపు ఇవ్వని కాంగ్రెస్
  • మీడియాతో శంకర్రావు

కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలంగా విధేయుడిగా ఉన్న తనను బలి పశువును చేశారని ఆరోపిస్తూ, శంకర్రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో మూలస్తంభాలైన చెన్నారెడ్డి, వెంకటస్వామి కుటుంబాలను విస్మరించారని ఆయన విమర్శలు గుప్పిస్తూ, రాహుల్ గాంధీకి ఓ లేఖను రాశారు.

పార్టీలో విధేయులకు స్థానం లేదని, బయటి నుంచి వచ్చిన వారికే అసెంబ్లీ టికెట్లను కట్టబెట్టారని ఆరోపించారు. రాహుల్ కు లేఖను పంపిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలిచే వారిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, ఇది విజయావకాశాలను ప్రభావితం చేయనుందని ఆయన అన్నారు.

More Telugu News