Telangana: టూ వీలర్ పై రూ. 23 లక్షల నగదు తీసుకెళుతుంటే పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు!

  • రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న గోవర్ధన్
  • బైక్ పై వెళుతుంటే తనిఖీ చేసిన ఎస్ఓటీ పోలీసులు
  • సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీనం

తన టూ వీలర్ పై సరైన పత్రాలు లేకుండా రూ. 23 లక్షల నగదును తీసుకు వెళుతున్న హైదరాబాద్ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, మెహిదీపట్నంకు చెందిన గోవర్ధన్ రెడ్డి అనే యువకుడు, రియల్ ఎస్టేట్ సంస్థలో పని చేస్తున్నాడు. మాదాపూర్ నుంచి మెహిదీపట్నం వెళుతున్న అతన్ని నిన్న ట్యాంక్ బండ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు ఆపి తనిఖీలు చేయగా, రూ. 23 లక్షలు కనిపించాయి. వీటికి సంబంధించిన ఎటువంటి రసీదులు అతని వద్ద లేకపోవడంతో, ఆ డబ్బును మాదాపూర్ పోలీసులకు అప్పగించామని, అతనిపై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

More Telugu News