Oppo A7: భారీ డిస్ప్లేతో నూతన స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిన ఒప్పో!

  • ఒప్పో ఏ7 చైనాలో విడుదల 
  • భారీ బ్యాటరీ, భారీ డిస్ప్లే 
  • ధర సుమారుగా రూ.16,500

ఒప్పో మొబైల్ దిగ్గజం తన నూతన స్మార్ట్ ఫోన్ 'ఒప్పో ఏ7' ని తాజాగా చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టం (కలర్ ఓఎస్ 5.2 స్కిన్)పై నడిచే ఈ ఫోన్ లో భారీ డిస్ప్లే (6.2 ఇంచ్ డిస్ప్లే), భారీ బ్యాటరీ (4230ఎమ్ఏహెచ్)తో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చైనా, నేపాల్ దేశాలలో లభిస్తోన్న ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. 3 జీబీ/ 4 జీబీ ర్యామ్, 32 జీబీ/ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది. దీని ధర సుమారుగా రూ.16,500గా ఉండనుంది.

More Telugu News