Telangana: కూకట్ పల్లిలో నామినేషన్ దాఖలు చేసిన నందమూరి సుహాసిని!

  • వెంటవచ్చిన బాలయ్య, పెద్దిరెడ్డి
  • భారీగా హాజరైన టీడీపీ శ్రేణులు
  • కార్యకర్తలతో భేటీ కానున్న సుహాసిని

మహాకూటమి కూకట్ పల్లి అభ్యర్థి, టీడీపీ నేత నందమూరి సుహాసిని ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడి మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి సుహాసిని నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె వెంట నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు, నేతలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి భారీఎత్తున టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు.

నామినేషన్ దాఖలు అనంతరం సుహాసిని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం బాలయ్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులతో కలిసి నందమూరి సుహాసిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలను కోరారు. తాను గెలిస్తే కూకట్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు.

More Telugu News