Chiranjeevi: కథ వినిపించిన త్రివిక్రమ్ .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరూ?

  • చిరూ తదుపరి సినిమా కొరటాలతో 
  • కథను ఓకే చేయించుకున్న త్రివిక్రమ్ 
  • ఆ తరువాత లైన్లో బోయపాటి  

చిరంజీవి కోసం తనదైన స్టైల్లో ఒక మంచి కథను సిద్ధం చేసిన కొరటాల శివ, ఆ కథకు పూర్తి స్క్రిప్ట్ రూపాన్ని ఇచ్చే పనిలో బిజీగా వున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి గల క్రేజ్ ను .. ఆయన సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేశాడట. ఇటీవల చిరంజీవిని కలిసి ఆ కథ వినిపించాడట.ఆ కథ నచ్చడంతో వెంటనే చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. కొరటాల తరువాత చిరంజీవి చేయబోయేది త్రివిక్రమ్ తోనేనని చెబుతున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. అల్లు అర్జున్ తో సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ .. చిరూ ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెడతాడట. త్రివిక్రమ్ తరువాత బోయపాటితో చిరంజీవి సినిమా వుండనుందని చెబుతున్నారు. ఈ వయసులో చిరంజీవి ఎంతమాత్రం గ్యాప్ తీసుకోకపోవడం విశేషం.  

More Telugu News