sensex: వారాంతంలో లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు

  • 197 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 66 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 16 శాతం పైగా లాభపడ్డ వొడాఫోన్ ఐడియా

ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. అంతర్జాతీయంగా ఉన్న సానుకూలతలతో పాటు డాలరు మారకంతో రూపాయి విలువ కాస్త బలపడటం కూడా మార్కెట్లకు కలసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 197 పాయింట్లు పుంజుకుని 35,457కు పెరిగింది. నిఫ్టీ 66 పాయింట్లు లాభపడి 10,682కు చేరుకుంది.

టాప్ గెయినర్స్:
వొడాఫోన్ ఐడియా (16.42%), భారతీ ఎయిర్ టెల్ (9.81%), జెట్ ఎయిర్ వేస్ (8.07%), వెంకీస్ ఇండియా (7.75%), టాటా కమ్యూనికేషన్స్ (5.91%).

టాప్ లూజర్స్:
ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (-10.18%), దేవాన్ హౌసింగ్ (-7.76%), యస్ బ్యాంక్ (-7.14%), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-6.34%), ఎన్ఎండీసీ (-6.07%).    

More Telugu News