srinivas: 'కవచం' రిలీజ్ డేట్ ఖరారు

  • శ్రీనివాస్ హీరోగా 'కవచం'
  • హీరోయిన్స్ గా కాజల్ .. మెహ్రీన్ 
  • డిసెంబర్ 7వ తేదీన రిలీజ్  

శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా 'కవచం' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా కాజల్ .. మరో కథానాయికగా మెహ్రీన్ నటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన సంగీతం ఈ సినిమాను యూత్ కి మరింత చేరువగా తీసుకెళుతుందని అంటున్నారు. 'సాక్ష్యం' నిరాశ పరచడంతో, బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News