Andhra Pradesh: కూకట్ పల్లిలో రెబెల్ అభ్యర్థిని నిలబెడతాం.. నందమూరి సుహాసినిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం!: స్థానిక కాంగ్రెస్ నేతల వార్నింగ్

  • స్థానికులకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
  • చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
  • వాటిని ఆంధ్రాలో చేసుకోవాలని హితవు

ప్రజాకూటమి(మహాకూటమి) పొత్తుల్లో భాగంగా కూకట్ పల్లి స్థానాన్ని నటుడు దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టీడీపీ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై మిత్రపక్షాల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలుత ఈ స్థానాన్ని టీడీపీ నేత పెద్దిరెడ్డికి కేటాయిస్తారని భావించినప్పటికీ చివరి నిమిషంలో నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి టికెట్ ను స్థానికులకు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఆందోళనకు దిగారు.

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్‌ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రెబెల్ అభ్యర్థిని నిలబెడతామనీ, సుహాసినిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు తెలంగాణలో కుట్ర రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. కుల రాజకీయాలను చంద్రబాబు ఆంధ్రాలో చేసుకుంటే మంచిదనీ, తెలంగాణలో మానుకోవాలని హితవు పలికారు.

More Telugu News