sumanth: తెరపైకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ .. రిలీజ్ డేట్ ఖరారు

  • డిసెంబర్ 7న 'సుబ్రహ్మణ్య పురం'
  • డిసెంబర్ 14న 'ఇదం జగత్'
  • దర్శకుడిగా అనిల్ శ్రీకంఠం

ఒక ఆలయం .. దాని చుట్టూ అల్లబడిన ఆసక్తికరమైన కథతో సుమంత్ కథానాయకుడిగా 'సుబ్రహ్మణ్య పురం' నిర్మితమైంది. అనూహ్యమైన మలుపులతో కొనసాగే ఈ సినిమా, డిసెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత వారం రోజులకే సుమంత్ మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు .. అదే 'ఇదం జగత్'.

అంజు కురియన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను దర్శకుడు అనిల్ శ్రీకంఠం అందిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుంది అంటున్నారు. వారం రోజుల వ్యవధిలో వస్తోన్న ఈ రెండు సినిమాల్లో, సుమంత్ కి సరైన హిట్ ఏ సినిమా ఇస్తుందో చూడాలి.  

More Telugu News