Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ కాన్వాయ్‌కి ప్రమాదం.. ఏడుగురికి గాయాలు

  • తూర్పు గోదావరి జిల్లాలో ప్రమాదం
  • గాయపడిన బౌన్సర్లు ఆసుపత్రికి తరలింపు
  • ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రంగంపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు గాయపడినట్టు కొందరు చెబుతున్నారు. అయితే ముగ్గురు క్షతగాత్రులను మాత్రం వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురు పవన్ బౌన్సర్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News