Revanth Reddy: పోలీసులపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన రేవంత్

  • తీవ్రరూపం దాల్చుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు
  • పోలీసులు వేధిస్తున్నారని రేవంత్ ఫిర్యాదు
  • మాట వినకుంటే కొడుతున్నారని వెల్లడి

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.. ఎన్నికల అధికారి రజత్ కుమార్‌‌కు ఫిర్యాదు చేశారు. తమ నియోజకవర్గానికి చెందిన ముఖ్య కార్యకర్తలను పోలీసులు బెదిరిస్తున్నారని.. మాట వినని వారిని కొడుతున్నారని రేవంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

More Telugu News