nandamuri: చంద్రబాబును కలిసిన నందమూరి హరికృష్ణ కుమార్తె.. కూకట్ పల్లి టికెట్ ఖరారైనట్టే!

  • పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి మూడో తరం నేత
  • సాయంత్రం కూకట్ పల్లి నేతలతో సమావేశం
  • అనంతరం అధికారికంగా సుహాసిని పేరు ప్రకటన

దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కూకట్ పల్లి టీడీపీ టికెట్ దాదాపు ఖరారైంది. ఈరోజు ఆమె విశాఖపట్నంలోని నొవోటెల్ హోటల్ లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సాయంత్రం కూకట్ పల్లి నేతలతో సమావేశం అనంతరం... ఆమె పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నేత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సుహాసినికి టీడీపీ టికెట్ ఇస్తున్న నేపథ్యంలో, కూకట్ పల్లి రాజకీయాలు వేడెక్కాయి.

More Telugu News