LB Nagar: ఇబ్రహీంపట్నంలో అయితే గెలవడం కష్టం.. చంద్రబాబు వద్ద సామ రంగారెడ్డి పంచాయితీ!

  • ఎల్బీ నగర్ స్థానాన్ని ఆశించిన సామ రంగారెడ్డి
  • ఇబ్రహీంపట్నం టికెట్ ఇచ్చిన తెలుగుదేశం
  • ఈ ఉదయం అమరావతికి వెళ్లి చంద్రబాబును కలిసిన సామ

తాను ఎల్బీ నగర్ టికెట్ ను ఆశిస్తే, ఇబ్రహీంపట్నం టికెట్ ఇచ్చారని, అక్కడి నుంచి పోటీ చేస్తే, గెలిచే అవకాశాలు తక్కువని సామ రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం అమరావతికి వచ్చి చంద్రబాబును కలిసి తన గోడును వెళ్లబోసుకున్న ఆయన, ఎల్బీ నగర్ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా ప్రజలకు దగ్గరగా ఉంటూ ఎంతో సేవ చేశానని ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్ల ఆర్ కృష్ణయ్యను నిలపాలని టీడీపీ నిర్ణయిస్తే, తాను ఆయన గెలుపుకోసం ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు.

ఈ దఫా తనకు టికెట్ లభిస్తుందని ఎంతో ఆశపడ్డానని, ఎల్బీ నగర్ నుంచి అయితే, 25 వేల ఓట్ల మెజారిటీతో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో తాను కాంగ్రెస్ పై ఆధారపడాల్సి ఉంటుందని, వారు ఏ మేరకు సహకరిస్తారోనన్న అనుమానాలు తనకున్నాయని చెప్పారు. తన సీటును మార్పించాలని ఆయన చంద్రబాబుకు విన్నవించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో తాను మాట్లాడతానని సామ రంగారెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News