TRS: టీఆర్ఎస్ ఎంపీలిద్దరు మా పార్టీలో చేరబోతున్నారు: రేవంత్ రెడ్డి

  • ఎన్నికల లోపే వాళ్లిద్దరూ మా పార్టీలో చేరతారు
  • ఈ నెల 19న నామినేషన్ వేస్తా
  • నాకు ముప్పై వేల మెజార్టీ రావడం ఖాయం

ఎవరెన్ని కుట్రలు చేసినా కొడంగల్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనకు ముప్పై వేల మెజార్టీ రావడం ఖాయమని చెప్పిన రేవంత్, ఈ నెల 19న నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, టీఆర్ఎస్ కు ప్రజలు తగినబుద్ధి చెబుతారని అన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు త్వరలో తమ పార్టీలో చేరనున్నారని అన్నారు. ఎన్నికలు జరిగే లోపు వాళ్లిద్దరూ తమ పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు. 

More Telugu News