yash: 'కేజీఎఫ్'కి 4 రోజుల్లో 3 కోట్ల వ్యూస్!

  • యష్ హీరోగా 'కేజీఎఫ్'
  • నాయికగా శ్రీనిధి శెట్టి 
  • డిసెంబర్ 21వ తేదీన రిలీజ్

యష్ హీరోగా కన్నడలో 'కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) సినిమా నిర్మితమైంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ .. చైనీస్ .. జపనీస్ భాషల్లో డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్ పై ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నెల 9వ తేదీన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు. అయిదు భాషల్లో కలుపుకుని 4 రోజుల్లో ఈ ట్రైలర్ కి 3 కోట్ల వ్యూస్ లభించాయి. ట్రైలర్ కి ఈ స్థాయి వ్యూస్ లభించడం పట్ల ఈ సినిమా టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. విడుదలైన ప్రతి భాషలోను ఈ సినిమా విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకంతో వున్నారు. వాళ్లు ఆశించినట్టుగానే ఈ సినిమా సంచలన విజయానికి తెరతీస్తుందేమో చూడాలి.        

More Telugu News